Chiranjeevi: చిరంజీవి నిద్రలేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా.. అసలు ఊహించలేరు?

Chiranjeevi: స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే చిరంజీవి కూడా కొందరిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.

ఇకపోతే చిరంజీవి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానటి సావిత్రి క్లాసికల్ బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నేను ఒకసారి చిరంజీవి గారిని కలవడానికి తన ఇంటికి వెళ్లాను అయితే అప్పటికి ఆయన కాలికి గాయం అయిందని కానీ నేను వచ్చానని తెలిసి చేతికర్ర సహాయంతో పైనుంచి కిందికి వచ్చి తనకు ఎంతో మర్యాద ఇస్తూ మాట్లాడారని తెలిపారు. ఇక ఆయన నాతో మాట్లాడుతూ నేను ప్రతిరోజు ఉదయం లేవగానే సావిత్రి అమ్మ ఫోటోనే చూస్తానని ఇప్పటికి ఆమె ఫోటో నా గదిలో ఉంటుందని చిరంజీవి గారు తెలిపారు.

సావిత్రి ఫోటో…
ఇలా ఆయన నాకు చెప్పడంతో నేను నమ్ముతానో లేదోనని భావించి పైకి వెళ్లి మరి అమ్మగారి ఫోటో తీసుకువచ్చి నాకు చూపించారు. నాకు చిరంజీవి గారిలో నచ్చే విషయం ఇదే ఆయన ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. ఆయన ఆచరణ మాటతీరు ఆలోచన మూడు ఒకే విధంగా ఉంటాయి. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అందుకే అమ్మగారి ఈ బుక్ లాంచ్ కూడా ఆయన చేతుల మీదుగానే జరగాలి అంటూ విజయ చాముండేశ్వరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.