చిరంజీవి సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేయడంతో సంతోషం అనిపించిందట.. ఎందుకో తెలుసా..

లవ్ స్టోరీ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి మెగస్టార్ చిరంజీవి బాలీవుడ్‌ నటుడు అమీర్ ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 న విడుదల విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది.. కోవిడ్ తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో.. అలాంటి అనుభూతి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఈవెంట్లలో మాట్లాడుతుంటే ప్రేక్షకుల నుంచి చప్పట్లు వింటున్నప్పుడు వచ్చే ఈ కిక్కే వేరప్ప.. అంటూ మట్లాడారు. 1980 నుంచి తనకు నిర్మాత నారాయణ్ దాస్ పరిచయం అని.. అతడంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్పాడు.

అతడిని గురువులా భావిస్తాను అన్నాడు. నాగ చైతన్య నిలకడగా వ్యవహరించేనటుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వేడుకకి వచ్చిన అమీర్ ఖాన్‌కి థ్యాంక్స్‌ అంటూ చెప్పాడు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ఫిదా సినిమా చేసేంతవరకు తనకు సాయిపల్లవి అంటే ఎవరో తెలియదని.. ఫిదా చిత్రంలో పాటలకు వేసిన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయా అంటూ చెప్పాడు. ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది.

నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదని.. తను ఒప్పుకోకూడదని మనసులో కోరుకున్నా అంటూ చెప్పాడు. ఎందుకంటే అన్నాచెల్లెళ్లుగా నటించాలని నాకు లేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్‌ చేయాలనుకుంటాను. అనుకున్నట్లుగానే సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని.. నాకు చాలా సంతోషం వేసిందని చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ఆకాక్షించారు.