మానవత్వం చాటుకుంటున్న అలీ దంపతులు..!

కరోనా ఉదృతి నేపధ్యంలో సెలెబ్రిటీలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చెస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్, నిఖిల్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తూ వారికి తగిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్టు లో తాజగా కమిడియన్ ఆలి కూడా చేరారు.

లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమలోని షూటింగ్స్ నిలిచిపోవడంతో పరిశ్రమ మీద ఆధారపడిన సభ్యులు అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్బంగా తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యునియన్ కు సంబంధించిన 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు సాయంగా అందజేశారు ఆలీ దంపతులు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతో మాకన్నా ముందే సెట్ లో ఉండే లేడీస్ మేము తినే ప్లేట్స్, కప్స్ శుబ్రం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వారు ఇబ్బందులలో ఉన్నారనే విషయం తెలుసుకుని 2 లక్షల రూపయిలతో సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నా అని అలీ చెప్పారు.