కరోనా ఉదృతి నేపధ్యంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ సాహయం చేస్తున్నాడు హీరో నిఖిల్. తనకు ట్వీట్ చేసిన వారికి ఇంజేక్షన్స్, ఆక్సిజన్, బెడ్స్ మరియు మందులను అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. మరీ సోనూసూద్ అంత కాకపోయినా తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు నిఖిల్. కరోనా ఉదృతి దృష్ట్యా తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినతరం చేసారు అధికారులు. కాగా, కోవిడ్ బాదితుడికి మందులు అందించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా మధ్యలో ఆయనను పోలీసులు నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్ లో తెలిపారు.
కరోనా వల్ల తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికీ మందులు అందించేందుకు ఉప్పల్ నుండి మినిస్టర్ రోడ్ కిమ్స్ కు వెళ్తుండగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీసులు నిఖిల్ కారును ఆపేశారు. ఆ సమయంలో బాధితుడి వివరాలు, మందుల చీటీ చూపించినా కూడా పోలీసులు నిఖిల్ ను వెళ్లేందుకు అనుమతించలేదు. ఖచితంగా ఈ పాస్ ఉండాలని తేల్చి చెప్పారు. అయితే ఈ పాస్ కోసం ట్రై చేస్తుంటే సర్వర్లు డౌన్ ఉండటం వల్ల తనకు ఈ పాస్ దొరకలేదని అయన ట్వీట్ చేసారు.
హీరో నిఖిల్ ట్వీట్ పై వెంటనే స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం “సార్ మీ లొకేషన్ మాకు పంపించండి.. తాము పోలీసులతో మాట్లాడి మీ సమస్య తీరుస్తాము” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో హీరో నిఖిల్ లొకేషన్ సమాచారం అందించగా వెంటనే లైన్ క్లియర్ చేసి పంపించారు. ఈ క్రమంలో అత్యవసరమైన అవసరం ఉన్నవారికి లాక్ డౌన్ లో అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…