Devi Sri Prasad: పాటలు బాలేదని ట్రోలింగ్ కు గురై అనంతరం హిట్ అందుకున్న దేవిశ్రీ సాంగ్స్ ఇవే!

Devi Sri Prasad: తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి మనకు సుపరిచితమే ఈయన తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక దేవి అందించే సంగీతానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఇకపోతే దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించిన కొన్ని పాటలు మొదట్లో బాలేవని పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురయ్యాయి. కట్ చేస్తే ఆ పాటలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. మరి దేవి శ్రీ ప్రసాద్ ఏ పాటల కారణంగా ట్రోలింగ్ ఎదుర్కొని అనంతరం ఆ పాటలతో హిట్ కొట్టారనే విషయానికి వస్తే..

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు:చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలోని ఈ పాట మొదట్లో భారీగా ట్రోల్స్ ఎదుర్కొంది. అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది.

సామి..సామి: పుష్ప సినిమాలో రష్మిక అల్లు అర్జున్ డాన్స్ చేసిన సామీ సామి అనే పాట మొదట్లో ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు ఈ పాట విన్నటువంటి ప్రేక్షకులు మాకు ఇదేం కర్మరా సామి అని దేవిని ట్రోల్ చేశారు. కట్ చేస్తే ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఇదే సినిమాలో ఉ అంటావా మామ సాంగ్ కూడా మొదట్లో ట్రోలింగ్స్ ఎదుర్కొని అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది.

మైండ్ బ్లాక్: మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత పెద్దగా ఎవరికి నచ్చలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇదే సినిమాలోని హీ ఈజ్ సో క్యూట్ అనే పాట కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ సినిమా విడుదల అయ్యే సమయానికి ఎంతో ఆదరణ సంపాదించుకుంది.

Devi Sri Prasad:

బుల్లెట్ సాంగ్: రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమాలోని కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అనే పాట మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తర్వాత ఎక్కడ చూసిన ఇదే పాటకు రీల్స్ చేస్తూ ఈ పాటను బ్లాక్ బస్టర్ చేశారు.

బాసు పార్టీ: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ ఐటెం నెంబర్ మొదట్లో దేవి వాయిస్ లో వచ్చిన లైన్స్ నువ్వు షార్ట్ ఏసుకో, నువ్వు ప్యాంటు ఏసుకో, లైన్స్ ని ఫుల్ ట్రోల్ చేశారు. మొత్తం సాంగ్ విడుదలయ్యేసరికి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.