Dhanush -Aiswarya: విడాకుల తర్వాత మొదటిసారి కలిసిన ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్… వైరల్ అవుతున్న ఫోటో?

Dhanush -Aiswarya: సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా కొన్ని జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన వారిలో కోలీవుడ్ జంట ఐశ్వర్య ధనుష్ జంట ఒకటి అని చెప్పాలి. వీరి వివాహమై దాదాపు 18 సంవత్సరాలు అయినప్పటికీ తాజాగా ఈ ఏడాది వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు.

ఈ విధంగా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నామని ప్రకటించడంతో అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట ఎక్కడ కలిసి కనిపించలేదు అయితే తాజాగా ఐశ్వర్య ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ ఫంక్షన్ లో భాగంగా వీరిద్దరూ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఐశ్వర్య ధనుష్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐశ్వర్య ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది నా పెద్ద కుమారుడు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది అంటూ ఆమె ఈ ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విడాకుల తర్వాత ఈ జంట ఇలా కుటుంబంతో కలిసి కనిపించడం అందరిని సంతోషానికి గురిచేసింది.

Dhanush -Aiswarya: కలిసుండాలని కోరుకున్న అభిమానులు..

ఈ విధంగా ఈ జంటను చూసిన అభిమానులు మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి వృత్తిపరమైన జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ధనుష్ కేవలం కోలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఐశ్వర్య సైతం బాలీవుడ్ సినిమాలకు దర్శకురాలిగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.