Dhanush -Aiswarya: సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా కొన్ని జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన వారిలో కోలీవుడ్ జంట ఐశ్వర్య ధనుష్ జంట ఒకటి అని చెప్పాలి. వీరి వివాహమై దాదాపు 18 సంవత్సరాలు అయినప్పటికీ తాజాగా ఈ ఏడాది వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు.
ఈ విధంగా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నామని ప్రకటించడంతో అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట ఎక్కడ కలిసి కనిపించలేదు అయితే తాజాగా ఐశ్వర్య ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ ఫంక్షన్ లో భాగంగా వీరిద్దరూ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఐశ్వర్య ధనుష్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐశ్వర్య ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది నా పెద్ద కుమారుడు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది అంటూ ఆమె ఈ ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విడాకుల తర్వాత ఈ జంట ఇలా కుటుంబంతో కలిసి కనిపించడం అందరిని సంతోషానికి గురిచేసింది.
ఈ విధంగా ఈ జంటను చూసిన అభిమానులు మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి వృత్తిపరమైన జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ధనుష్ కేవలం కోలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఐశ్వర్య సైతం బాలీవుడ్ సినిమాలకు దర్శకురాలిగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…