Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!

Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన RRR సినిమా విడుదల వాయిదా పడటంతో చరణ్ తన దృష్టిని మొత్తం శంకర్ సినిమా పై పెట్టారు. ఇప్పటికే దాదాపు కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!
Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!

ఇదిలా ఉండగా తాజాగా మరొక షెడ్యూల్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శంకర్ సినిమాలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈయన సినిమాలో పాటలకు కూడా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారని విషయం అందరికీ తెలిసిందే.

Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!

ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ సినిమాలో తర్వాత షెడ్యూల్ కోసం భారీగా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో భాగంగా హీరో హీరోయిన్ పై ఒక పాట చిత్రీకరణ జరపనున్నారు. ఈ పాట కోసం శంకర్ ఏకంగా ఇరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ టాక్.

నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను దక్కించుకున్న జీ స్టూడియో..

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించే ఈ పాట కోసం భారీ మొత్తంలో సెట్ ఏర్పాటు చేసి అందులోనే ఈ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం.కేవలం ఒక పాట కోసం 23 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ జీ స్టూడియోస్ ఏకంగా 200 కోట్లకు దక్కించుకున్నట్లు పెద్దఎత్తున సమాచారం వినబడుతుంది. ఇదే కనుక నిజమైతే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విజయాన్ని అందుకున్నట్లేనని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.