రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన ఫేస్బుక్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలకు ఫేస్ బుక్ ను ఆదేశించింది.

ఇటీవలే రాహుల్‌ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన రాహుల్ ఖాతా బ్లాక్ చేస్తున్నట్లు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కూడా చర్యలకు ఆదేశించడంతో రాహుల్ కు మరో షాక్ తగిలినట్లయింది.