fans worrying about akkineni chaitanya and akhil stardom comparing with nagarjuna
King Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి అలానే అక్కినేని ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారి టైంలో ఒక ట్రెండ్ ను సెట్ చేసారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ తండ్రికి తగిన తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ అక్కినేని యంగ్ హీరోలు.
ఇక నాగ చైతన్య మార్కెట్ ఈ ఏడాది కాస్త పెరిగిందనే చెప్పాలి లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు చైతన్య. అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు చేదు అనుభవాలుగా మిగిలాయి. అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తన ఖాతాలో హిట్ అందుకున్నాడు అఖిల్.
ప్రస్తుత చైతన్య థాంక్యూ సినిమాతో… అఖిల్ ఏజెంట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో కొడుకులందరూ వంద కోట్ల క్లబ్లో చేరుతుంటే అక్కినేని కుర్రాళ్ళు మాత్రం 30, 40 కోట్ల క్లబ్ లోనే ఉండిపోయారు. అయితే ఇటీవలే విడుదలైన బంగార్రాజు తో తండ్రి కొడుకులు 50 కోట్ల క్లబ్ లో చేరారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు. పండుగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ ఏడాదిలో మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. ఇప్పటి వరకు 10 రోజుల్లో 35 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 4 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ యంగ్ హీరోలు వంద కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరతారో…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…