మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ సర్జరీ సక్సెస్.. !

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.ఈ విధంగా ఆపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సాయితేజ్ స్పృహలోకి రావడంతో ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఈ నేపథ్యంలో అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.కాగా నేడు ఉదయం సాయి తేజ్ కు సర్జరీ మొదలుపెట్టారు.

కొన్ని గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు అతనికి కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయిందని తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.

ఈ విధంగా సాయి ధరంతేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని త్వరలోనే ఈ ప్రమాదం నుంచి కోలుకుని క్షేమంగా బయటకు తిరిగి వస్తారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాయి ధరంతేజ్ ప్రమాదం గురించి మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడంతో అభిమానులు ఎంతో కంగారు పడ్డారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని, కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతం కావడంతో ఇకపై తనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని ఈ సందర్భంగా వైద్యులు వెల్లడించారు.