మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.ఈ విధంగా ఆపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సాయితేజ్ స్పృహలోకి రావడంతో ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఈ నేపథ్యంలో అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.కాగా నేడు ఉదయం సాయి తేజ్ కు సర్జరీ మొదలుపెట్టారు.
కొన్ని గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు అతనికి కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయిందని తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.
ఈ విధంగా సాయి ధరంతేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని త్వరలోనే ఈ ప్రమాదం నుంచి కోలుకుని క్షేమంగా బయటకు తిరిగి వస్తారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాయి ధరంతేజ్ ప్రమాదం గురించి మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడంతో అభిమానులు ఎంతో కంగారు పడ్డారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని, కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతం కావడంతో ఇకపై తనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని ఈ సందర్భంగా వైద్యులు వెల్లడించారు.
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…