మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.ఈ విధంగా ఆపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సాయితేజ్ స్పృహలోకి రావడంతో ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఈ నేపథ్యంలో అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.కాగా నేడు ఉదయం సాయి తేజ్ కు సర్జరీ మొదలుపెట్టారు.
కొన్ని గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు అతనికి కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయిందని తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.
ఈ విధంగా సాయి ధరంతేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని త్వరలోనే ఈ ప్రమాదం నుంచి కోలుకుని క్షేమంగా బయటకు తిరిగి వస్తారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాయి ధరంతేజ్ ప్రమాదం గురించి మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడంతో అభిమానులు ఎంతో కంగారు పడ్డారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని, కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతం కావడంతో ఇకపై తనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని ఈ సందర్భంగా వైద్యులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…