Prudhvi Raj: ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు నా మైండ్ పొల్యూట్ చేసి నన్ను వైసీపీ పార్టీ వైపు తీసుకెల్లాడు. అప్పుడు కొవ్వు ఎక్కువై అలా మాట్లాడాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిన పృథ్విరాజ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

2014వ సంవత్సరంలో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఎంతో కీలకంగా వ్యవహరించారు.ఇక ఈయన పార్టీ ప్రచారంలో భాగంగా పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ ఎస్విబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు అయితే ఈయన ద్వారా ఆ పదవిని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

ఇతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనని ఆ పదవి నుంచి తొలగించారు. ఇలా పదవికి దూరమైనపృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన వైసిపి పార్టీపై పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ ఏకంగా వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

నాలో ఉగ్రవాది ఉన్నారు..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు ఏ విధంగా శిక్షణ ఇస్తారో అలాగే ఒక వ్యక్తి నా మైండ్ మొత్తం పొల్యూట్ చేసి తనని వైసీపీ పార్టీ వైపు వెళ్లేలా చేశారని తెలిపారు. ఇక పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేనే వళ్ళు కొవ్వుపట్టి నోటికొచ్చినది మాట్లాడానని తెలిపారు. ఆ సమయంలో నాలో పృధ్విరాజ్ కాకుండా ఒక వైసీపీ ఉగ్రవాది ఉన్నారని ఈ సందర్భంగా పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.