Divyavani: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా టీడీపీలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన నటి దివ్యవాణి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఈ విధంగా ఈమె పార్టీని వదిలి బయటకు రావడమే కాకుండా టీడీపీ నేతలపై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ క్రమంలోనే దివ్యవాణి మరొక టీడీపీ మహిళా నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మరొక టీడీపీ మహిళా నేత దివ్యవాణికి ఫోన్ చేసి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్లారు అని ప్రశ్నించారు.
పెద్దాయన (చంద్రబాబు) తో కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది. ఈసారి గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమో అంటూ అవతలి మహిళ దివ్యవాణితో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యవాణి సమాధానం చెబుతూ మీకు తెలిసినదే కదా నాకు పదవి ముఖ్యం కాదు.పార్టీ కోసం గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను అయితే అక్కడ తనకు ఏమాత్రం గౌరవం లేదని దివ్యవాణి తెలిపారు.
పదవుల కోసం కుక్కల మాదిరి అందరి చుట్టూ తిరగాలి అంటే నేను చేయలేను ఒక లిమిట్ వరకు పనులు చేస్తున్నాం అంటూ ఈమె తెలిపారు. నన్ను పార్టీలో ఎవరో టార్గెట్ చేశారు అంటూ ఈమె పలు విషయాలను వెల్లడించారు. నేను రాజకీయాల కోసం బ్రతకడం లేదు. మేము పబ్లిక్ ఫిగర్స్ వంద మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ దివ్యవాణి తెలిపారు.
ఇకపోతే అవతల మహిళ మాట్లాడుతూ నా పదవి నీకు ఇస్తే తీసుకుంటావా అని ప్రశ్నించగా…అశోక్ బాబు, అచ్చెన్నాయుడు,జనార్థన్ ప్రస్తుతం రాజకీయం అంతా వీళ్ల చుట్టే ఉందన్నారు. వారి చెప్పినట్లే చేయాలి లేదంటే పదవులు ఎవరికి ఇవ్వరు. దివ్యవాణికి అంగన్వాడి పదవి బాధ్యతలు ఇవ్వాలన్నారు అంటూ మహిళా నేత చెప్పగా.. ఆమెపర్సనల్ పని చేయదు కదా అన్నారు అంటూ మహిళా నేత చెప్పగా దివ్యవాణి అంగన్వాడి పదవి ఇస్తే ఇలా బాడ్ పనులు చేయాలా అంటూ ప్రశ్నించారు. కష్టపడిన వాళ్ళకు పార్టీలో విలువ లేదని ఈ సందర్భంగా దివ్యవాణి అవతలి మహిళా నేతతో మాట్లాడిన ఈ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…