Madhavan: గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు.. హీరో మాధవన్ షాకింగ్ కామెంట్స్!

Madhavan: తమిళ స్టార్ హీరోగా మాధవన్ అందరికీ సుపరిచితమే.అయితే ఈయన కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Madhavan: గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు.. హీరో మాధవన్ షాకింగ్ కామెంట్స్!

గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మాధవన్ ప్రస్తుతం 75 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫెస్టివల్లో భాగంగా ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల తను ఎలాంటి సినిమాలు చేయలేదని, కరోనా ముందు కూడా తను రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సినిమాలు చేయకుండా ఉండటం వల్ల తాను ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని వెల్లడించారు.

Madhavan: గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు.. హీరో మాధవన్ షాకింగ్ కామెంట్స్!

లాక్ డౌన్ సమయంలో తనని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడినది నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ‘డీకపుల్డ్‌’ వెబ్‌ సిరీస్ మాత్రమే తనని ఆదుకుందని ఈ సందర్భంగా మాధవన్ వెల్లడించారు. ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై తాను దర్శకత్వం వహించిన రాకెట్రీ గురించి ప్రమోషన్ చేశారు.ఈ సినిమా జూన్ 1వ తేదీ హిందీ ఇంగ్లీష్ తమిళ భాషల్లో విడుదల కానుందని తెలిపారు.

నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా…

అనంతరం ఈ సినిమాని తెలుగు, మలయాళ భాషలలో డబ్ చేయనున్నట్లు మాధవన్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ నుంచి తనలో ఏదో తెలియని భయం ఉందని, ఈ సినిమా పైనే తను ఆశలు పెట్టుకున్నట్లు మాధవన్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సూర్య, షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారని మాధవన్ తెలియజేశారు. ఇక ఈ సినిమాని ప్రముఖ భారత శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.