చనిపోడానికి రైల్వే ట్రాక్ వరకు వెళ్లిన జబర్దస్త్ కంటెస్టెంట్స్..!

మనస్సుకు ప్రశాంతంగా ఉండాలంటే దాదాపు చాలామంది చూసే ప్రోగ్రాం జబర్దస్త్. అంతగా అందులో కామెడీ ఉంటుంది. నవ్వుల జంక్షన్, కమెడియన్ల ఫన్ ప్లేస్ ఎక్కడ అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ వేదిక మాత్రమే. గత ఏడేళ్లకు పైగా ఈ వేదికపై ఎన్నో రకాలుగా నవ్వుల హంగామా చేశారు జబర్దస్త్ వీరులు. కమెడియన్స్ పంచ్ డైలాగ్స్‌కి తోడు కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ ప్రోగ్రాం ఎంత టాప్ లో ఉంటుందో.. నిర్వాహకులు రిలీజ్ చేసే ప్రోమోలు కూడా అంతే ఉంటాయి. ప్రోమోలతో రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించడం ఈ జబర్దస్త్ నిర్వాహకుల స్పెషాలిటీ. తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎముందంటే.. ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీలోనే కనిపిస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చే ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో కూడా నవ్వులు పూయించాడు.

ఆదితో కలిసి పంచులు విసురుతూ, కామెడీను పండించాడు. వాటమ్మ వాట్ ఈజ్ దిసమ్మా అంటూ వచ్చే సాంగ్ లో మొదట డ్యాన్స్ వేస్తూ కనిపిస్తారు. సచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటి అన్నా అంటూ రామ్ ప్రసాద్ ను ఆది అడుగుతాడు. దానికి అతడు తనకు బస్సు పడదురా.. అందుకే ఇలా వచ్చాను అంటూ పంచ్ వేస్తాడు.

చనిపోవడానికి రామ్ ప్రసాద్, ఆది ట్రాక్ పై కూర్చోవడంతో.. ఇక్కడ వద్దురా.. ట్రాక్ తుప్పుపట్టింది.. ఇన్ ఫెక్షన్ అవుతుంది అంటూ పంచ్ వేస్తాడు ప్రసాద్. తర్వాత రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ.. సూసైడ్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చారా సార్ అంటూ అడుగుతాడు రాజు. అవును అంటూ రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారు సార్.. కొన్ని రోజులు ఆగితే మీరే పోయేవారు కదా అంటూ పంచ్ వేస్తాడు రామ్ ప్రసాద్.