టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ దృశ్యం 1 సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు వెంకీ మామ అభిమానులు దృశ్యం 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో రాంబాబు అనే ఒక వ్యక్తి పోలీసుల వేధింపుల నుంచి తన కుటుంబాన్ని ఏవిధంగా రక్షించుకుంటారు. అందుకోసం అతను చేసే పోరాటం ఏమిటి? అన్న అంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఇక దృశ్యం 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మలయాళం బ్లాక్ బస్టర్ దృశ్యం కి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా వచ్చింది. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ చివరికి ఓటీటీ వైపే మొగ్గు చూపారు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో విక్టరీ వెంకటేష్, మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్, అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ సినిమా అమెజాన్ లో విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఆరేళ్లుగా డిపార్ట్మెంట్ ను వేధిస్తున్న ప్రశ్నలివి అంటూ అసహనంగా మాట్లాడటం.. చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ రావద్దు అంటూ వెంకటేష్ ప్రాధేయపడం అందరికీ సినిమాపై ఆసక్తిని కలిగేలా చేస్తుంది.
ఈ టీజర్ ని బట్టి చూస్తే దృశ్యం 2 సినిమా మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ టీజర్ ను చూసి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇదివరకే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా అమెజాన్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ దృశ్యం సినిమా మరోసారి ఓటీటీలో విడుదలకి సిద్ధమైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…