ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలు పాన్ ఇండియా సినిమాలను పెంచుకుంటున్నారు. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న కారణంగా తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనిబాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి హీరోలు బాలీవుడ్ కి పరిచయమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా వీరి కోవలోకే చేరబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారు.
ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి చెర్రీతో పాటు తారక్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇటీవల తారక్ చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాను కూడా కొద్దిగా వెనక్కి జరిపినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…