Jabardasth Emmanuel: వర్షకు దూరంగా ఉన్న ఇమ్మానుయేల్… అసలు విషయం చెబుతూ ఎమోషనల్ అయిన ఇమ్మూ?

Jabardasth Emmanuel: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష.ఈ ఇద్దరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ కూడా నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగింది.అదేవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మల్లెమాలవారు సైతం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ జంటకు ఎన్నోసార్లు జబర్దస్త్ వేదికపై పెళ్లి కూడా చేశారు.

ఈ విధంగా ఇమ్మానుయేల్ వర్షా జంట విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఎడమొహం పెడ మొహం పెట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని, అందుకే మాట్లాడుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానియేల్ నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని అనే బ్రేకప్ సాంగ్ పాడారు. ఇలా ఇమ్మూ వేదికపై ఈ పాట పాడుతూ ఉన్నంతసేపు వర్ష ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా వర్షా ఎమోషనల్ అయినప్పటికీ వీరిద్దరూ దూరంగా ఉండడానికి గల కారణం బయటపడలేదు.

Jabardasth Emmanuel: వర్ష ఇమ్మూ మధ్య నిజంగా గొడవలున్నాయా…

ఇలా పాట పాడిన అనంతరం వర్ష వేదిక పైకి వెళ్ళగా ఇంద్రజ ఇమ్మానుయేల్ ను ప్రశ్నిస్తూ ఏమైంది అంటూ అడిగారు. ఇంద్రజ ఇలా అడిగినప్పటికీ ఇమ్మానుయేల్ మౌనంగా ఉండడంతో అప్పటికి ఇప్పటికీ మీ మధ్య ఏం మారడం లేదా అంటూ రష్మీ అడగగా మా మధ్య ఎప్పటికీ మారదేమో అంటూ వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల గురించి పరోక్షంగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.