అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన జెస్సీ.. ఎమోషనల్ అయిన సిరి, షన్ను..!

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన మోడల్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో టాస్క్ లో పాల్గొంటూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జెస్సీ సిరి, షన్నుతో కలిసి ఎంతో స్నేహ భాగంగా మెలిగేవారు. ఇలా త్రిమూర్తులుగా పేరుగాంచిన ఈ ముగ్గురిలో నేడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

జెస్సీ గత వారం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అతనికి పరీక్షలు నిర్వహించిన అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ జెస్సీని సీక్రెట్ రూమ్ కి పంపించి తనతో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడం వల్ల తనని హౌస్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జెస్సి తను హౌస్ నుంచి వెళ్లి పోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా హౌ సభ్యులందరూ ఎంతో షాక్ అవుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా సిరి, షన్ను తన స్నేహితుడు హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడు అని తెలియడంతో ఒక్కసారిగా తనను కౌగిలించుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు. హౌస్ సభ్యులకు బై చెప్పిన జశ్వంత్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చాడు .

ఇక 10వ వారంలో భాగంగా నామినేషన్ లిస్టులో లేని జశ్వంత్ మరో రెండు వారాల పాటు హౌస్లో కొనసాగే వాడని, అయితే తనకు అనారోగ్యం కారణంగా ఇలా మధ్యలోనే బయటకు రావడం అందరిని ఎంతో ఆవేదనకు గురి చేసింది. బయటకు వచ్చిన జెస్సీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తిరిగి హౌస్ లోకి వెళతాడా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.