బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన మోడల్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో టాస్క్ లో పాల్గొంటూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జెస్సీ సిరి, షన్నుతో కలిసి ఎంతో స్నేహ భాగంగా మెలిగేవారు. ఇలా త్రిమూర్తులుగా పేరుగాంచిన ఈ ముగ్గురిలో నేడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
జెస్సీ గత వారం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అతనికి పరీక్షలు నిర్వహించిన అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ జెస్సీని సీక్రెట్ రూమ్ కి పంపించి తనతో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడం వల్ల తనని హౌస్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జెస్సి తను హౌస్ నుంచి వెళ్లి పోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా హౌ సభ్యులందరూ ఎంతో షాక్ అవుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా సిరి, షన్ను తన స్నేహితుడు హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడు అని తెలియడంతో ఒక్కసారిగా తనను కౌగిలించుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు. హౌస్ సభ్యులకు బై చెప్పిన జశ్వంత్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చాడు .
ఇక 10వ వారంలో భాగంగా నామినేషన్ లిస్టులో లేని జశ్వంత్ మరో రెండు వారాల పాటు హౌస్లో కొనసాగే వాడని, అయితే తనకు అనారోగ్యం కారణంగా ఇలా మధ్యలోనే బయటకు రావడం అందరిని ఎంతో ఆవేదనకు గురి చేసింది. బయటకు వచ్చిన జెస్సీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తిరిగి హౌస్ లోకి వెళతాడా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…