బ్రేకింగ్ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నేటి ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన రోశయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈయన తన రాజకీయ జీవితంలోఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు.

మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రోశయ్య అతని మరణానంతరం ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుకుగా పాల్గొనే రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తూ సుమారు 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న రోశయ్య ఇలా మరణించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆయన పార్థివదేహం ఆస్పత్రి నుంచి తన స్వగృహానికి తరలించనున్నారు.