ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నేటి ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన రోశయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈయన తన రాజకీయ జీవితంలోఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు.
మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రోశయ్య అతని మరణానంతరం ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుకుగా పాల్గొనే రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తూ సుమారు 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న రోశయ్య ఇలా మరణించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆయన పార్థివదేహం ఆస్పత్రి నుంచి తన స్వగృహానికి తరలించనున్నారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…