బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారు అనేదాని గురించి కంటెస్టెంట్ ల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ వారం కాజల్, పింకీ బయటకు వెళ్లే అవకాశం ఉందని మాట్లాడుతుండగా షణ్ముఖ్ మానస్ వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ఇక టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా పలు గేమ్స్ నిర్వహించారు.
ఇక ఐస్ వల్ల సిరి, శ్రీరామ్ ఇప్పటికి కోలుకోలేదు. పింకీ చేసిన పనివల్ల శ్రీరామ్ ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక సిరికి కూడా మోషన్స్ కావడంతో పింకీ కలగజేసుకుని తనకి పంచదార నీళ్లు తాగమని, అరటిపండు తినమని సలహా ఇచ్చింది.
అంతలోనే బిగ్ బాస్ కలగజేసుకుని పింకీ మీరు మీకైనా ఇతర కుటుంబ సభ్యుల కైనా సొంత వైద్యం చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడంతో పింకీ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇక టికెట్ టు ఫినాలే ఆఖరి రౌండ్ లో శ్రీరామ్ , మానస్ పోటీపడగా ఈ రౌండ్ ముగిసే సరికి శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలోకి అడుగుపెట్టారు. ఇలా ఫినాలేలోకి అడుగు పెట్టిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీరామ్ ఎంపిక కావడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అవకాశం అందినట్టే అంది చేజారిపోయిందని మానస్ బాధ పడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…