చివరి అతిథిగా ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న.. సూపర్ స్టార్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి అతిథిగా వచ్చి తనదైన శైలిలో ఇందులో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం రేటింగ్స్ పెంచడం కోసం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను అతిధులుగా ఆహ్వానించారు. మెగా పవర్ స్టార్ తర్వాత ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.

ఇక దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత వచ్చారు. విడాకుల తర్వాత సమంత మొదటిసారిగా బుల్లి తెరపై సందడి చేయడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే సమంత ఎపిసోడ్ ప్రసారం కావడంతో కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి అతిథిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయం తెలియడం లేదు.