తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వరుస ఫ్లాప్ లను చవిచూసిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలను నిర్మిస్తూ దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి అనిల్ పాధురి దర్శకత్వంలో రొమాంటిక్ అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆకాష్ పూరితో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
పూరి జగన్నాథ్ కు ఒక కుమారుడు ఒక కుమార్తె అన్న సంగతి మనకు తెలిసిందే. కొడుకు ఆకాష్ పూరి సినిమాలలో నటిస్తూ ఉండగా కూతురు కూడా త్వరలోనే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. పూరి కూతురు పవిత్రకు సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం నాన్న బలవంతం మీదే బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో నటించనుందని ఈ సందర్భంగా ఆకాష్ తెలియజేశారు.
అయితే తనకు సినిమాల్లో నటించడం కన్నా నిర్మాణరంగంలో పనిచేయడం ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో పవిత్ర పూరి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాణ బాధ్యతలను చేపడుతుందని ఆకాశ్ ఈ సందర్భంగా పవిత్ర వెండితెర ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…