యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి అతిథిగా వచ్చి తనదైన శైలిలో ఇందులో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం రేటింగ్స్ పెంచడం కోసం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను అతిధులుగా ఆహ్వానించారు. మెగా పవర్ స్టార్ తర్వాత ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.
ఇక దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత వచ్చారు. విడాకుల తర్వాత సమంత మొదటిసారిగా బుల్లి తెరపై సందడి చేయడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే సమంత ఎపిసోడ్ ప్రసారం కావడంతో కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి అతిథిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయం తెలియడం లేదు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…