Jr NTR: యావత్ భారతదేశాన్ని గుండెల్లో పెట్టుకొని నడుస్తాం… రెడ్ కార్పెట్ ఎంట్రీ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Jr NTR: ఇండియాలో ప్రతి ఒక్కరు చూపు రేపు లాస్ ఏంజల్స్ లో జరగబోయే ఆస్కార్ వేడుకలపైనే ఉంది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా మన తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ రావాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ అట్ ది ఆస్కార్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రెడ్ కార్పెట్ పై నడపడం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఆస్కార్ వేడుక రోజు తాము కొమరం భీం పాత్రలో రెడ్ కార్పెట్ పై నటుడిగా నడవనని తెలిపారు..

ఇలా రెడ్ కార్పట్ పై యావత్ భారతదేశాన్ని తన గుండెల్లో పెట్టుకొని రెడ్ కార్పెట్ పై నడుస్తానని ఇలా ఒక భారతీయుడుగా రెడ్ కార్పెట్ పై నడవడం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ నాటు నాటు పాట గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ పాట షూటింగ్ కోసం తాము చాలా కష్టపడ్డామని తెలిపారు.

Jr NTR: ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం…


ఈ పాట షూటింగ్ కు వారం రోజులు ముందు నుంచి రిహార్సల్స్ చేస్తున్నామని షూటింగ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా రిహార్సిల్స్ చేస్తూ ఈ పాట కోసం చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఎంతో కష్టపడినా ఈ పాటకు నేడు సరైన ప్రతిఫలం దక్కుతుందన్న సంతోషం ప్రతి ఒక్కరికి ఉంది.తప్పనిసరిగా ఈ పాటకు ఆస్కార్ అందుకొని చిత్రబృందం స్వదేశానికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.