Comedian Venu: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎందరో స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఇందులో సందడి చేసినటువంటి వారిలో వేణు ఒకరు. వేణు టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్ ఫర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు ఉన్న ఫలంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు..
ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వేణు బయటకు రావడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈయన కూడా బయటకు వచ్చారని అందరూ భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వేణు పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించలేదు. అయితే ఈయన దర్శకుడిగా మారి తాజాగా బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని మనస్పర్ధలు కారణంగా బయటికి రాలేదని తెలియజేశారు.
సినిమాలపై ఉన్న పిచ్చే తనని జబర్దస్త్ నుంచి బయటకు నడిపించిందని తెలిపారు.ఎలాగైనా సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన కసి అని తెలిపారు.అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సినిమా వేటలో పడ్డానని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు పేరు డబ్బు వస్తున్న కూడా వదిలేసి బయటకు వచ్చానని, ,అంతకుమించి తాను జబర్దస్త్ వదిలి రావడానికి మరే కారణాలు లేవంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…