Naresh Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్నటువంటి రిలేషన్ వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి నరేష్ తిరిగి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు.
ఈమెను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ గురించి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వీరి వ్యవహారం కాస్త మీడియా వార్తల్లో నిలిచింది.ఇలా ఎన్నో గొడవలు జరిగినప్పటికీ నరేష్ పవిత్ర మాత్రం తమ బంధం గొప్పది అంటూ ఎప్పటికప్పుడు తమ బంధం గురించి తెలియజేస్తూ వచ్చారు..
2022 డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ కేక్ కట్ చేస్తే లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని విడుదల చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని ఒక సినిమాలో భాగంగా ఇలా నటించారని తెలుస్తోంది.
ఇలా పెళ్లి చేసుకున్నట్లు నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తాజాగా తమ హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఈ జంట తమ హనీమూన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులో ఉన్నప్పటికీ ఈ ఫోటోలు ఎలా సాధ్యమయ్యాయి అనే విషయానికి వస్తే…
వీరిద్దరూ ఇదివరకే కలిసే ట్రిప్ కి వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు వీరిద్దరు హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు పాతవి కావడంతో ప్రతి ఒక్కరు ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ విషయంపై నరేష్ స్పందించాల్సి ఉంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…