తారక్ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నానంటూ హేలన చేసారు.. : ఎన్టీఆర్

ఒకవైపు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ నుంచి మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు.

ఆ కార్యక్రమం లాగానే ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ షో ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా.. మొదట బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సీజన్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత నానీ, గత మూడు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే అంతటి హైప్ ను కూడా ఎవరు మీలో కోటీశ్వరులు వస్తుందని.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందేంటంటే.. మొదట ఎన్టీఆర్ ఎంతో లావుగా ఉండేవారు.. తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగలో బాగా స్లిమ్ గా తయారు అయ్యారు ఎన్టీఆర్.

ఈ విషయం గురించి ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. తాను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడినని అందుకు కొందరు తనని అసహ్యంగా ఉన్నావని అన్నారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దానికి తాను ఎంతో బాధపడేవాడిని అంటూ ఎదురుగా ఉన్న కంటెస్టెంట్ తో చెప్పారు. ఇలా షోలో అతడు తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటూ.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు యంగ్ టైగర్.