Kakinada Shyamala : ఎన్టీఆర్ కి లేడీస్ వీక్నెస్ ఉంది… సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కాకినాడ శ్యామల…!

కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటక రంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర, బుల్లి తెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి వివరించారు.

ఎన్టీఆర్, లక్ష్మి పార్వతికి పడిపోయాడు…

కాకినాడ శ్యామల ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటూ చెప్పారు. ఆయన నటించిన పాత్రలు ఇంకెవరూ చేయలేరు అంటూ చెప్పారు. అయితే సినిమాలలో ఎన్నో మహోన్నతమైన పాత్రలను వేసిన ఆయన లక్ష్మి పార్వతికి పడిపోయి జీవితంలో పెద్ధ తప్పు చేసారు. ఆడవాళ్ళ వీక్ నెస్ వల్లే లక్ష్మి పార్వతికి పడిపోయాడు.

ఒక రైటర్ గా ఆయన చరిత్ర రాస్తానంటూ వచ్చిన లక్ష్మి పార్వతి ఆయన మనిషి అయింది చివరకు అంటూ చెప్పారు. ఆవిడకు ఋణం ఉంది అయన భార్య అవ్వాలని అందుకే అయింది. కానీ ఆవిడను పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. ఎంతటి వీరుడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటూ చెప్పారు.