Kangana Ranaut : బ్రాహ్మస్త్ర తీసి 600 కోట్లు తగలబెట్టారు… కరణ్ జోహార్ ఫేక్ రివ్యూలతో హిట్ అని డబ్బా కొడుతున్నాడు : కంగనా రానౌత్

Kangana Ranaut : బాలీవుడ్ లో సూటిగా ఒకరిని విమర్శించాలంటే కంగనా ముందుంటుంది. ముఖ్యంగా కరణ్ జోహార్ మరియు నెపోటిజం గురించి మాట్లాడాలంటే కంగనానే గుర్తొస్తుంది బాలీవుడ్ మీడియాకి. సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా ‘బ్రాహ్మస్త్ర’ సినిమా విడుదల అయింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రన్ బీర్, ఆలియా జంటగా నటించిన ఈ ఫాంటసీ డ్రామా కొంతమందికి నచ్చింది. కొంత మందికి నచ్చడం లేదు. ఇక కంగనా కూడా ఈ సినిమా గురించి ఘాటుగా స్పందించింది. సినిమా చెత్తగా ఉందంటూ ఫైర్ అయింది.

600 కోట్లు కాల్చేశాడు అయాన్ ముఖర్జీ…

సినిమా బాగోలేదని చెప్పడం వరకూ ఓకే కానీ మరీ సినిమా కోసం 600 కోట్లు తగలేశాడంటూ డైరెక్టర్ మీద ఫైర్ అయింది బాలీవుడ్ క్వీన్. సినిమా కోసం 12 ఏళ్ళు కష్టపడిన అయాన్ 400 రోజులకు పైగా షూట్ చేసి, 14 మంది డీఓపీలను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లని మార్చి రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశాడు అంటూ ఫైర్ అయింది. బ్రాహ్మస్త్ర సినిమా బడ్జెట్ సరి చేసుకోడానికి ఫాక్స్ స్టూడియోస్ అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చారు.

ఇలాంటి సినిమాల వల్ల ఇంకెన్ని స్టూడియోలు మూతపడతాయో అంటూ కామెంట్స్ చేసింది. ఇక కరణ్ జోహార్ మీద ఘాటు వాఖ్యలు చేసింది కంగనా. ఫేక్ రివ్యూలు చెప్పేవారిని, రేటింగ్ సంస్తలను కొని హిట్ అని చెప్పుకోవడం అతనికి కామన్. హిందూ మతాన్ని అణిచివేయాలని, సౌత్ వేవ్ ను తొక్కేయాలని చూస్తున్నాడు, సెలబ్రిటీల శృంగార జీవితం మీద ఉన్న ఆసక్తి కరణ్ జోహార్ కు సినిమా స్క్రిప్ట్ మీద లేదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది.