Kota Srinivarao: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలు అన్ని నిమిషాలలోనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగపడే విషయాలు షేర్ చేయటమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అనేక దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియా వల్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించాడు. అలాగే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. దీంతో అనేకమంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన తన మరణ వార్త గురించి తెలుసుకున్న కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ..” తన మరణం గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వాటిని ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఉదయం 7, 7:30 గంటల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.నేనే ఒక 50 కాల్స్ వరకు మాట్లాడాను.. ఇది నిజమే అనుకుని ఓ పది మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారు. ఇలాంటి అవాస్తవాలను మీరే అరికట్టాలని పోలీసులకు చెప్పాను. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి.. మనిషి ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంతత నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…