Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో చేయడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Krishnam Raju: సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ తారలు మొత్తం తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో నిర్వహించారు.

ముందుగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈయన అంత్యక్రియలు మాత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారక లాంచనాలతో నిర్వహించారు. అయితే ఇలా అంత్యక్రియలను ఫామ్ హౌస్ లో నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని త్వరలోనే ఇక్కడ తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇలా ఈయన బ్రతుకున్న సమయంలో తాను మరణిస్తే అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేయాలని తన ఇంటిని చూసుకుంటూ అక్కడే ఉంటానంటూ పలుసార్లు వెల్లడించారట.ఇలా బ్రతికున్న సమయంలో తన అంత్యక్రియలు అక్కడే చేయాలని తన పెదనాన్న కోరడంతో ప్రభాస్ చివరి క్షణంలో తన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ నిర్వహించారు.

Krishnam Raju: కృష్ణంరాజు కోరిక మేరకే అంత్యక్రియలు..

ఇలా కృష్ణంరాజు కోరిక ప్రకారమే ఆయన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు ప్రభాస్ చేతుల మీదుగా కాకుండా తన సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు గారికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడైన ప్రబోద్ చేతులమీదుగా జరిగాయి. కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.