Krishnam Raju: అన్నం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడిచిన కృష్ణంరాజు… అందుకే అందరి కడుపు నింపుతున్నారా?

Krishnam Raju:టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు గత నెల 11వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే.

కృష్ణంరాజు రాజుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి కావడంతో ఈయన ఇంటికి వెళితే వారికి అతిథ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదని మనకు తెలిసిందే.అదేవిధంగా ఈయన సినిమా షూటింగ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎన్నో రకాల భోజనాలను తెప్పించి కడుపునిండా వారికి ఆహారం పెడతారు.ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ కూడా అతిథి మర్యాదలకు ఏమాత్రం తీసిపోరు.అయితే కృష్ణంరాజు ఇలా అందరికీ అన్నం పెట్టడం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

కృష్ణం రాజుగారు తన కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఈయన జర్నలిస్టుగా పనిచేసేవారు.ఇలా జర్నలిస్టుగా పనిచేసినటువంటి ఈయన సినిమాలపై మక్కువతో సినిమా అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగే వారట.అయితే ఈయన దగ్గర చాలీచాలని డబ్బులు ఉండడంతో కొన్నిసార్లు ఒక పూట మాత్రమే తిని మరికొన్నిసార్లు ఒక పూట పస్తులు ఉండేవారు.అయితే ఈయన రాజుల కుటుంబానికి చెందినప్పటికీ ఇంట్లో వారు సినిమాలలోకి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో ఈయన ఇంట్లో వారిని డబ్బులు అడిగే వారు కాదట.

Krishnam Raju: ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కృష్ణంరాజు…

ఈ విధంగా ఒకసారి ఉదయం భోజనం చేసిన తర్వాత బాగా ఆకలి వేసింది అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంటి కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి తనని అప్పుగా డబ్బును అడిగారట.అయితే కృష్ణంరాజు గారి మొహమాటన్ని గుర్తించిన తన స్నేహితుడు ఆయనకు కడుపునిండా అన్నం పెట్టి మరి డబ్బులు ఇచ్చి పంపించారు అప్పటినుంచి కృష్ణంరాజు గారు ఎవరు వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టడమే కాకుండా సినిమా లొకేషన్ కి వెళ్ళిన అక్కడ కూడా అందరికీ భోజనాలు పంపించేవారని, ఆ ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కనుక అందరి కడుపు నింపుతున్నారని తెలుస్తోంది.