బుల్లితెర సీరియల్ లో.. ఉప్పెన బ్యూటీ.. రేమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఛానల్ లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. కుటుంబ కథనంతో తెరకెక్కుతున్న ఈ సీరియల్స్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానల్ “ముత్యమంత ముద్దు”అనే సరికొత్త ధారావాహిక సీరియల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ను ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేతులమీదుగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

రుణం పేరుతో దారుణాలు చేస్తున్న అత్తమామలు, కన్న వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని బాధపడే కోడలు ఈ కాన్సెప్ట్ తో ముత్యమంత ముద్దు త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అంటూ ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ప్రారంభోత్సవంలో భాగంగా కృతి శెట్టి బుల్లితెరపై సందడి చేశారు. దీనికోసం ఈ అమ్మడు సుమారు 5 లక్షలు అందుకుందని సమాచారం.

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఓ మహిళ గీత ముహూర్తం మించిపోతుంది త్వరగా పెళ్ళి తంతు పూర్తి చేయమని చెప్పడంతో.. కృతి శెట్టి తాంబూలంతో తాళిని పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో కృతి శెట్టి మరొక యువతితో మాట్లాడుతూ.. పెళ్లి జరిగితే అమ్మాయి జీవితమే మారిపోతుంది, ఇంటి పేరు, ఊరి పేరు మారుతాయి. అమ్మానాన్నలను దాదాపు మర్చిపోవాలి అని పెళ్లి గురించి సంభాషణ చేస్తూ సాగిపోయే ఈ సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.