Movie News

బుల్లితెర సీరియల్ లో.. ఉప్పెన బ్యూటీ.. రేమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఛానల్ లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. కుటుంబ కథనంతో తెరకెక్కుతున్న ఈ సీరియల్స్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానల్ “ముత్యమంత ముద్దు”అనే సరికొత్త ధారావాహిక సీరియల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ను ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేతులమీదుగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

రుణం పేరుతో దారుణాలు చేస్తున్న అత్తమామలు, కన్న వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని బాధపడే కోడలు ఈ కాన్సెప్ట్ తో ముత్యమంత ముద్దు త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అంటూ ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ప్రారంభోత్సవంలో భాగంగా కృతి శెట్టి బుల్లితెరపై సందడి చేశారు. దీనికోసం ఈ అమ్మడు సుమారు 5 లక్షలు అందుకుందని సమాచారం.

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఓ మహిళ గీత ముహూర్తం మించిపోతుంది త్వరగా పెళ్ళి తంతు పూర్తి చేయమని చెప్పడంతో.. కృతి శెట్టి తాంబూలంతో తాళిని పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో కృతి శెట్టి మరొక యువతితో మాట్లాడుతూ.. పెళ్లి జరిగితే అమ్మాయి జీవితమే మారిపోతుంది, ఇంటి పేరు, ఊరి పేరు మారుతాయి. అమ్మానాన్నలను దాదాపు మర్చిపోవాలి అని పెళ్లి గురించి సంభాషణ చేస్తూ సాగిపోయే ఈ సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

2 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

3 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

3 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

3 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

6 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

6 hours ago