తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఛానల్ లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. కుటుంబ కథనంతో తెరకెక్కుతున్న ఈ సీరియల్స్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానల్ “ముత్యమంత ముద్దు”అనే సరికొత్త ధారావాహిక సీరియల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ను ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేతులమీదుగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
రుణం పేరుతో దారుణాలు చేస్తున్న అత్తమామలు, కన్న వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని బాధపడే కోడలు ఈ కాన్సెప్ట్ తో ముత్యమంత ముద్దు త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అంటూ ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ప్రారంభోత్సవంలో భాగంగా కృతి శెట్టి బుల్లితెరపై సందడి చేశారు. దీనికోసం ఈ అమ్మడు సుమారు 5 లక్షలు అందుకుందని సమాచారం.
ఇక ఈ ప్రోమోలో భాగంగా ఓ మహిళ గీత ముహూర్తం మించిపోతుంది త్వరగా పెళ్ళి తంతు పూర్తి చేయమని చెప్పడంతో.. కృతి శెట్టి తాంబూలంతో తాళిని పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో కృతి శెట్టి మరొక యువతితో మాట్లాడుతూ.. పెళ్లి జరిగితే అమ్మాయి జీవితమే మారిపోతుంది, ఇంటి పేరు, ఊరి పేరు మారుతాయి. అమ్మానాన్నలను దాదాపు మర్చిపోవాలి అని పెళ్లి గురించి సంభాషణ చేస్తూ సాగిపోయే ఈ సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…