Kumari Aunty: శ్రీదేవి డ్రామా కంపెనీలోకి కుమారి ఆంటీ.. ఒక్క దెబ్బతో సెలబ్రిటీ అయ్యిందిగా?

Kumari Aunty: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నటువంటి పేరు. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం గడుపుతూ ఉన్నటువంటి ఈమెను సోషల్ మీడియా వాళ్ళు భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఈమె వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో భారీగా పాపులర్ అయింది.

ఇకపోతే ఇటీవల ఈమె ఫుడ్ బిజినెస్ కి భారీగా డిమాండ్ రావడంతో ఏకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి ప్రారంభించారు. ఇలా రేవంత్ రెడ్డి వరకు ఈమె విషయం వెళ్లడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈమె ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వెళ్లబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు యాంకర్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది అసలు ఎప్పుడు మీకు కాల్ చేశారు ఎప్పుడు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించగా ఈమె మాత్రం నవ్వుతూ దయచేసి ఇవేవీ అడగకండి అంటూ సమాధానం చెప్పారు.

సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ…

ఈ విధంగా కుమారి ఆంటీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంతోనే ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా పాపులర్ అయ్యి అదే పాపులారిటీతో బిజినెస్ క్లోజ్ అయ్యి సీఎం చొరవతో తిరిగి ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. దీంతో ఏకంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి.