సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న లేడీ కమెడియన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..

ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ మీనన్ తమిళ చిత్రం నీతనే ఎన్ పొన్వసంతం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. మొదటి నుంచి ఆమె తన కామెడీతో అందరినీ మెప్పించింది. ఇదిలా ఉండగా ఆమెకు ఆగస్టు 26న నిశ్చితార్థం జరిగిందని.. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.

ఆమె ప్రియుడు, ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణుడు సంజయ్‌ను ఆమె సెప్టెంబర్ 9 న వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట దర్శనమిచ్చాయి. కాగా ఇటీవల శరారకృతిపై దృష్టిపెట్టిన విద్యుల్లేఖకు ఫిట్​నెస్​ నిపుణుడు సంజయ్​తో పరిచయమైంది. ఆ తర్వాత వారి రిలేషన్ ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది.

తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు. తెలుగు, తమిళ చిత్రాలతో పరిచయమైన ఈమె.. తనదైన యాస, డైలాగ్స్​తో ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత విద్యుల్లేఖ సినిమాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా దాంపత్య జీవితానికి వెల్ కమ్ అంటూ చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఆమె ఇప్పుడు చాలా తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నేడు అంగరంగా వైభవంగా జరిగింది.