కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన.. ఏర్పాట్లు పూర్తి!

తెలంగాణలో రాజకీయలు హిట్ ఎక్కాయి. టీఆర్‌ఎస్ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికి నియోజకవర్గాన్ని మంత్రులు చూట్టేస్తుండగా.. ఈనెల 16న నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నదానిపై అందరీలో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటన వెళ్ళనున్నారు. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల విసృత్తంగా జిల్లాలా పర్యటన కొనసాగించనున్నారు.

సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌‌తో కలిసి నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.