ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. అయితే చాలామంది చార్జింగ్ పెట్టే విధానంలో చాలా తప్పులు చేస్తున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. తర్వాత చార్జింగ్ ఆగడం లేదంటూ లబోదిబోమంటుంటారు. అలా కాకుండా మొదటి నుంచే మనం దీనిపై జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చు. స్మార్ట్ ఫోన్ ను ఇష్టారీతిగా ఛార్జింగ్ చేస్తే త్వరగా పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిపోక ముందే చాలామంది చార్జింగ్ పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇది ఫోన్ మన్నికపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 100 శాతం వరకు కూడా చార్జింగ్ అస్సలు చేయకూడదు. రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేవారు కూడా ఉంటారు.
ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం వరకు చార్జింగ్ పెడితే చాలు అంటున్నారు నిపుణులు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతే.. ఆఫోన్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు.. 90 శాంత వరకు చర్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడటం.. ఫోన్లోని పాటలను వినడం.. బ్రౌజ్ చేయడం లాంటివి చేస్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే క్రమంలో కూడా చార్జింగ్ బాగా అయిపోతూ ఉంటుంది.. దీనికి సెట్టింగ్ లోకి వెళ్లి ఉపయోగం లేని యాప్స్ ను ఇన్ యాక్టివ్ చేస్తే సరిపోతుంది. చార్జింగ్ మరి కొంత సేపు ఎక్కువగా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…