Mahanati Movie: మహానటి సినిమాలో నిత్యామీనన్ ను అందుకే వద్దనుకున్నారా? అసలు విషయం చెప్పిన అశ్వినీ దత్!

Mahanati Movie: తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ఈ తరం వారికి కూడా తెలిసింది.ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినిమాలలో కోట్లు సంపాదించిన దానధర్మాల పేరిట ఆస్తులను దానం చేసి చివరికి ఒంటరిగా తనువు చాలించారు.

ఈమె ఇండస్ట్రీలో నటిగా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. అయితే ఈమెకు మహానటి అనే పేరు వచ్చినప్పటికీ ఆ పేరు వెనుక ఆ విజయం వెనుక ఎంతో కష్టం కన్నీళ్లు దాగి ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి ఒక అద్భుతమైన నటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిర్మాత అశ్విని దత్ తన బ్యానర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

మహానటి పేరుతో కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ చిత్రం చేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ కి బదులు నిత్యమీనన్ పేరు వినిపించింది. సావిత్రి బయోపిక్ చిత్రంలో నిత్యామీనన్ నటించబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే కొన్ని కారణాల వల్ల నిత్యామీనన్ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ అందుకున్నారు. ఇందులో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించడం అనేకన్నా జీవించారని చెప్పాలి.

Mahanati Movie: మద్యం ముట్టుకోనని చెప్పడం వల్లే…

తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకోవడానికి గల కారణం తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎక్కడ నిత్యమీనన్ పేరు ప్రస్తావించకపోయిన ఈ సినిమాని ఒక మలయాళీ హీరోయిన్ రిజెక్ట్ చేశారని తెలిపారు. ఆమె అలా రిజెక్ట్ చేయడానికి కారణాన్ని కూడా అశ్వినీ దత్ వెల్లడించారు.ఈ సినిమాలో తాను మద్యం ముట్టుకోనని తాగే సన్నివేశాలు ఉంటే నటించనని చెప్పడంతో నిర్మాత ఏకంగా హీరోయిన్ ని మార్చేశారు. అలా ఈ సినిమాలో నిత్యమీనన్ అవకాశం కోల్పోయి కీర్తి సురేష్ అందుకున్నారు. అయితే ఈయన ఎక్కడ నిత్యామీనన్ పేరు ప్రస్తావించలేదు.