Balakrishana - Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balakrishana – Mahesh Babu: ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా కొనసాగుతోంది. బాలయ్య బాబు తనదైన శైలిలో చేస్తున్న ఈ టాక్ షో కు మంచి క్రేజ్ ఉంది. ఐఎండిబి లో కూడా ఈ టాక్ షో 9.8 రైటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ టాక్ షోలో 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ 9 ఎపిసోడ్ లో బాలకృష్ణ పలువురు సినీ ప్రముఖులతో ముచ్చటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.

Balakrishana - Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
నందమూరి అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తున్నారు.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది, దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రియాల్టీ షో చివరి ఎపిసోడ్ కోసం కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా రావడం విశేషం.

ఎన్టీఆర్.. కృష్ణ ప్రస్తావన..

బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చివరి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాల కృష్ణ మహేష్ బాబు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు.. మహేష్ బాబు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అనే విషయాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, కృష్ణ ప్రస్తావన ఏమైనా తీసుకువస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.