Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!
Nagarjuna: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి సినిమా విడుదల సమయంలోను లేత సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది.ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా విడుదలైన తర్వాత నాగార్జున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలోనే నాగార్జున ఆయన సతీమణి అమల స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.స్వామివారి దర్శనం అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ…కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామివారి దర్శనం చేసుకోలేక పోయానని,ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందామని చెప్పారు. అలాగే ప్రపంచ ప్రజల అందరికి మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నాననీ నాగార్జున చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…