Balakrishana - Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Balakrishana – Mahesh Babu: ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా కొనసాగుతోంది. బాలయ్య బాబు తనదైన శైలిలో చేస్తున్న ఈ టాక్ షో కు మంచి క్రేజ్ ఉంది. ఐఎండిబి లో కూడా ఈ టాక్ షో 9.8 రైటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ టాక్ షోలో 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ 9 ఎపిసోడ్ లో బాలకృష్ణ పలువురు సినీ ప్రముఖులతో ముచ్చటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.
ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
నందమూరి అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది, దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రియాల్టీ షో చివరి ఎపిసోడ్ కోసం కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా రావడం విశేషం.
బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చివరి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాల కృష్ణ మహేష్ బాబు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు.. మహేష్ బాబు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అనే విషయాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, కృష్ణ ప్రస్తావన ఏమైనా తీసుకువస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…