Mahesh Babu: గుంటూరు కారం నా ఆఖరి తెలుగు చిత్రం… షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ !

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈయన ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అనంతరం మహేశ్ బాబు, శ్రీలీల ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూకి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ విషయం గురించి మహేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాము. ఈ సినిమాలో ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే నేను ఈ సినిమా తరువాత తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అంటూ మహేష్ షాక్ ఇచ్చారు.మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు.

ఇక పై తెలుగు సినిమాలు చేయకపోవచ్చు…

మరో తెలుగు సినిమా వస్తుందో రాదో తెలియకనే ఈ సినిమాలో పాటలను గట్టిగా ప్లాన్ చేసాము. దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యామని మహేష్ తెలిపారు. కానీ ఈ అమ్మాయి డాన్స్ చూసే సరికి కాస్త భయం వేసిందని ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.