Manchu Lakshmi : నలుగురు పిల్లల్ని కనాలి అనుకున్నా… కానీ…: నటి మంచు లక్ష్మి

Manchu Lakshmi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థాన్నాన్ని సంపాదించుకున్నారు. మంచు మోహన్ బాబు వారసత్వంతో ‘అనగనగా ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రశంసలు అందుకుంది. వెండి తెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. అంతే కాకుండా లక్ష్మి మంచుకు ఒక యుట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో హోమ్ టూర్లు, వాళ్ళ ఇంట్లోని సెలెబ్రేషన్లు, దానికి సంబంధించిన వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు.

పిల్లలంటే చాలా ఇష్టం…

మంచు లక్ష్మి తన జీవితంలో మంచి అనుభూతి తన కూతురితో ఉండటమే అంటూ చెబుతారు. అమ్మ అయ్యాకే నేను ఎందుకు పుట్టానో ఆ పర్పస్ తెలిసింది అంటూ ఆనందపడుతారు. అయితే పిల్లలంటే అంత ఇష్టం ఉన్న లక్ష్మి ఎందుకు ఒక్క పాపని మాత్రమే కన్నారు అనే ప్రశ్నకు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చాలా ఆశ ఉండేది కానీ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు ఒక్కరితో సరిపెట్టాడు అంటూ చెప్పారు.

అయితే తన ఇంట్లో పాపతో పాటు రోజు ఐదారు మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ ఆటలు అల్లరి కంటే వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మి దగ్గర ఉంటే పిల్లలు సేఫ్ గా ఆనందంగా ఉంటారు అనుకుని వదిలి వెళ్లడం బాగా ఆనందాన్ని ఇస్తుంది అంటూ లక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఒక స్కూల్ ని దత్తత తీసుకుని పిల్లల చదువులకోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు మంచు లక్ష్మి.