Manjula: కృష్ణ ఇందిరా దేవి పెళ్లి రోజును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన మంజుల.. పోస్ట్ వైరల్!

Manjula: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల కారణంగా ఈ నెల 15వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించి దాదాపు పది రోజులుగా కావస్తున్నప్పటికీ ఇంకా ఇతని మరణ వార్త నుంచి అభిమానులు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు కోలుకోలేకపోతున్నారు.ఇక మహేష్ బాబు కొడుకుగా తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు.

ఇక కృష్ణ మొదటిసారిగా ఇందిరా దేవినీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా కృష్ణ ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. ఇక కృష్ణ నటి విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లిచేసుకున్నప్పటికీ ఇందిరా దేవిని కూడా ఎంతో మంచిగా చూసుకున్నారు.ఇకపోతే ఈమె మరణించిన తక్కువ వ్యవధిలోనే కృష్ణ గారు కూడా మరణించడం మహేష్ బాబు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.

ఇకపోతే కృష్ణ,ఇందిరా దేవి మరణించిన తర్వాత వారి మొదటి వివాహ వార్షికోత్సవం రావడంతో కృష్ణ కుమార్తె మంజుల ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. కృష్ణ నవంబర్ 15వ తేదీ మరణించారు. అయితే వీరి వివాహ వార్షికోత్సవం నవంబర్ 22వ తేదీ రావడంతో మంజుల తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు.

తనని కలవడానికి మమ్మల్ని వదిలి వెళ్లారు…
తమ తల్లిదండ్రుల జీవిత భాగస్వామ్యం స్వర్గంలో జరుగుతుంది. తన తల్లి మరణించిన తర్వాత తండ్రి కృష్ణ గారు ఆమె లేని లోటును భరించారు. బహుశా అందుకేనేమో తనని కలవడానికి చాలా తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు అంటూ ఈ సందర్భంగా మంజుల తన తల్లి తండ్రితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.