Manjula: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల కారణంగా ఈ నెల 15వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించి దాదాపు పది రోజులుగా కావస్తున్నప్పటికీ ఇంకా ఇతని మరణ వార్త నుంచి అభిమానులు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు కోలుకోలేకపోతున్నారు.ఇక మహేష్ బాబు కొడుకుగా తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు.
ఇక కృష్ణ మొదటిసారిగా ఇందిరా దేవినీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా కృష్ణ ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. ఇక కృష్ణ నటి విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లిచేసుకున్నప్పటికీ ఇందిరా దేవిని కూడా ఎంతో మంచిగా చూసుకున్నారు.ఇకపోతే ఈమె మరణించిన తక్కువ వ్యవధిలోనే కృష్ణ గారు కూడా మరణించడం మహేష్ బాబు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.
ఇకపోతే కృష్ణ,ఇందిరా దేవి మరణించిన తర్వాత వారి మొదటి వివాహ వార్షికోత్సవం రావడంతో కృష్ణ కుమార్తె మంజుల ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. కృష్ణ నవంబర్ 15వ తేదీ మరణించారు. అయితే వీరి వివాహ వార్షికోత్సవం నవంబర్ 22వ తేదీ రావడంతో మంజుల తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు.
తనని కలవడానికి మమ్మల్ని వదిలి వెళ్లారు…
తమ తల్లిదండ్రుల జీవిత భాగస్వామ్యం స్వర్గంలో జరుగుతుంది. తన తల్లి మరణించిన తర్వాత తండ్రి కృష్ణ గారు ఆమె లేని లోటును భరించారు. బహుశా అందుకేనేమో తనని కలవడానికి చాలా తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు అంటూ ఈ సందర్భంగా మంజుల తన తల్లి తండ్రితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…